హైదరాబాద్, డిసెంబర్ 05 : కేరళ నటి భావన పై లైంగిక దాడి కేసులో స్టార్ నటుడు దిలీప్ ఇక తప్పించుకొనే అవకాశం కన్పించడం లేదు. ఫిబ్రవరి 17న కొయంబత్తూరులో భావనపై లైంగిక దాడి జరిగిన తర్వాత ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా మొదటి ఛార్జీ షీట్ లో తొలి ప్రధాన నిందితుడిగా ఉన్న దిలీప్ పేరును ప్రస్తావించిన పోలీసులు, సరైన ఆధారాలు లభించకపోవడంతో ఆయన పేరును 8వ నిందితుడిగా మార్పు చేశారు. మంగళవారం ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. ఛార్జ్ షీట్ను అంగీకరించటంతో దిలీప్ సహా నిందితులందరికీ నోటీసులు కూడా జారీ చేసింది. ఇందులో మొత్తం 12 మంది నిందితుల పేర్లను పోలీసులు ప్రస్తావించారు. వీరిలో దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ పేరును ముఖ్య సాక్షిగా పేర్కొనటం గమనార్హం.