రాజ్కోట్, నవంబర్ 10 : గుజరాత్ అభయారణ్యంలో సింహాలను వేటాడిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలపై సింహాలను వేటాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో వేటాడడానికి ఉపయోగించిన బైక్ నంబర్ స్పష్టంగా కనిపించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ వ్యక్తులను రాజ్కోట్కు చెందిన ఇద్దరు, ఆమ్రేలికి చెందిన ఒకరిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఒకరు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.