హైదరాబాద్ సెప్టెంబర్ 27: సినీ పరిశ్రమలో సినిమాలపైనే బతికే జనాలు చాలా మంది ఉంటారు. అటువంటి వారు ఒక సంవత్సరం కష్టపడి తీసిన సినిమాను దయ దాక్షిణ్యం లేకుండా ఒక్క మాటలో బాలేదని అనేస్తారు. మన తెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువ సినిమాలు విజయాన్ని అందుకుంటాయి. కానీ ఆ చిత్రాల విజయాన్ని కూడా ఈ విమర్శకుల చేతుల్లో పడి చివరికి నిర్మాత కు నష్టాలను మిగులుస్తుంది. అది పక్కన పెడితే ఈ మధ్య కత్తి మహేష్ రోజు రోజుకి వార్తల్లో నిలవడం సాధారణ విషయం అయిపోయింది. మహేశ్ కత్తి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సినిమాను బట్టి రివ్యూ ఉంటుంది కానీ, సినిమాలపై కక్షతో రివ్యూలు రాస్తామా? అని అన్నారు. తాము కూడా ప్రేక్షకులలాంటి వారమేనని, కాకపోతే సినిమాలను విశ్లేషించగలమని అన్నారు. సినిమాను ప్రేమించాం కాబట్టే తాము విశ్లేషకులమయ్యామని అన్నారు. విశ్లేషకులను వచ్చి సినిమా తీయమనండని కొందరు అంటున్నారని, తమ పని అది కాదన్నారు. సినిమా బాగుంటే బాగుందని, లోపాలు ఉంటే ఉన్నాయని రాస్తామని అన్నారు. అంతేగాని, సినిమా గురించి అన్నీ తెలుసని తామేం విర్రవీగడం లేదని అన్నారు. కత్తి మహేష్ ఏం సాదిద్దామని రివ్యూ లు ఇస్తారో అర్థం కాదని, ఈయన అందరి నుండి అసంతృప్తి ని మాత్రమే కోరుకునేలా ఉన్నాడని కొందరు అభిప్రాయపడ్డారు. మరి సినిమా అభిమానుల అసంతృప్తి ఎంతవరకు ఎంజాయ్ చేస్తారో చూడాలి మరి.