హైదరాబాద్, సెప్టెంబర్ 23 : రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా మహిళాలందరు బతుకమ్మ వేడుకలను కోలాహలంగా జరుపుకుంటున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ నెల 28న నిర్వహించే మహా బతుకమ్మ ఏర్పాట్లను పర్యాటక కార్యదర్శి వెంకటేశం పర్యవేక్షించగా, రాష్ట్ర బ్యావరిటైజేషన్ కార్పోరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ హైదరాబాద్ లోని కార్యాలయ ఉద్యోగులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. పంజాగుట్ట లండన్ మ్యానేజ్ మెంట్ అకాడమీలో ముస్లిం విద్యార్ధులు, మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి ఆడి పాడారు. వికారాబాద్ విశ్వభారతి డిగ్రీ కళాశాల, ఆదిలాబాద్ నలంద డిగ్రీ కళాశాల, కరీంనగర్ వికాస్ కళాశాలల విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఆడుకుంటూ సందడి చేశారు.