హైదరాబాద్, సెప్టెంబర్ 21: సికింద్రాబాదు రైల్వే స్టేషన్ లో అడుగుపెట్టాలనకుంటున్నారా? ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే! ఫ్లాట్ ఫాం టిక్కెట్ ధరను 100 శాతం పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేశాయి. పండగల రద్దీ ఆధారంగా ప్రైవేటు రవాణా సంస్థలు టికెట్ల ధరలకు అధికంగా పెంచి సొమ్ము చేసుకుంటాయని ఇప్పటివరకు విన్నాం. కానీ మేము కూడా వీటికి ఏ మాత్రం తీసిపోమని నిరూపించుకుంది భారతీయ రైల్వే వ్యవస్థ. ఇంత వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రవేశించాలంటే ఫ్లాట్ ఫాం టికెట్ 10 రూపాయలుగా ఉండేది. నేటి నుంచి ఈ టికెట్ ధర 20 రూపాయలు కానుంది. ఇప్పటికే ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే అధికారుల నుంచి ఉత్తర్వులు జారీ కావడంతో సిబ్బంది కొత్త టికెట్లు వినియోగంలోకి తెచ్చారు. దీనిపై ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.