హైదరాబాద్, సెప్టెంబర్ 18: బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమంలో చీరల నాణ్యతపై మహిళల భారీ నిరసనలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన టీఆర్ఎస్ నాయకుడు టి పద్మరావు మాట్లాడుతూ..." దసరాకు ముందు చీరల పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు క్రైస్తవుల, ముస్లింలతో సహా అన్ని మతస్థులకు చీరలు అందేలా చేనేత వస్త్రదారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సమయాభావ పరిస్థితుల వల్ల చీరలు సమయానికి అందకపోవడం వల్ల సూరత్ నుంచి చీరలను తెచ్చామని" అసలు విషయాన్ని తెలిపారు.