కంచె ఐలయ్య పుస్తకంపై రోశయ్య కామెంట్

SMTV Desk 2017-09-11 19:02:29  Kancha Ilaiah, Book on Arya Vysyas,Konijeti Rosaiah, Samajika smugglurlu komatollu (Vysyas are social smugglers)

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే తాజాగా ఇదే విషయంపై తమిళనాడు మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య స్పందిస్తూ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని పుస్తకాలు రాయడం సబబు కాదని సూచించారు. సంస్కృతి పరంగా సామాజికవర్గ ఆహార అలవాట్లు ఉంటాయని, వాటిని విమర్శించడం మంచి పద్ధతి కాదని తెలిపారు. వైశ్యులు వృత్తి పరంగా మాత్రమే వ్యాపారాన్ని ఎంచుకున్నారని ఆయన స్పష్టం చేశారు. పుస్తకంలోని అభ్యంతరాలపై ఐలయ్యతో ఆర్యవైశ్యులు చర్చించాలనే అభిప్రాయాన్ని రోశయ్య వెల్లడించారు.