హైదరాబాద్, సెప్టెంబర్ 11: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ గత మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టును ఆశ్రయించగా, పౌరసత్వం రద్దుపై నిర్ణయాన్ని వెలువరించే ముందు తన వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ రోజు హైకోర్టులో రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా కోర్టు నిలిపివేసింది. పౌరసత్వం రద్దుపై పునఃసమీక్షించాలని కేంద్రహోంశాఖను రమేశ్ కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థనపై ఆరు వారాల్లోగా తేల్చాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.