వెంగళ్రావు నగర్ సెప్టెంబర్ 7: నిరుద్యోగ యువతకు రాజీవ్ నగర్ చౌరస్తాలోని టెక్ మహీంద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కోర్సును నాలుగు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి, ప్రముఖ కంపెనీల్లో ఉపాధి కల్పించనునట్లు టెక్ మహేంద్ర ఫౌండేషన్ ప్రతినిధి రవితేజ తెలిపారు. ఈ శిక్షణకు బీటెక్, ఎంటెక్, ఎంసీఏతో పాటు జావాపై అవగాహన కలిగిన నిరుద్యోగ యువత అర్హులన్నారు. ఈ నెల సెప్టెంబర్ 12 లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ తెలియజేసింది. పూర్తి వివరాలకు ఈ ఫోన్ నెంబర్లు 76759 14735, 70936 01006 ద్వార సంప్రదించాలని తెలిపారు.