హైదరాబాద్, సెప్టెంబర్ 3 : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర కేబినెట్ ప్రమాణస్వీకారంలో పాల్గొన్నఅనంతరం ఢిల్లీ నుంచి ప్రత్యెక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తరువార హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయంలో ఆయన చేతుల మీదుగా అంతర్జాతీయ న్యాయ సంస్థ 78వ సమావేశాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. అయితే ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మండలి చైర్మన్ స్వామిగౌడ్, సీఎస్ ఎస్పీ సింగ్ హజరయ్యారు. తదుపరి భేగంపేట నుంచి శామీర్ పేటలోని నల్సార్ వర్సిటీకి ఆయన వెళ్లారు.