మోడీ 2.0లో విదేశాంగ మంత్రిగా ఎంపికైన జయశంకర్ కొడుకు మొదటిరోజే వార్తల్లో నిలిచారు. పాస్పోర్ట్కు సంబంధించి ఒక నెటిజన్ ఆయనకు ట్వీట్ చేయగా.. చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. “పాస్పోర్ట్, వీసాలు, ఫారిన్ నుంచి బయటికి వచ్చేందుకు నేను ఎవరికి హెల్ప్ చేయలేను. నన్ను ఎవరూ అడగవద్దు. నాకే చాలా సమస్యలు ఉన్నాయి” అని ఆయన ట్వీట్ చేశారు.