రంజాన్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మసీదులు, ఈద్గాల్లో మరమ్మతులు, రంగులు వేయడం కోసం రూ.5 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిధులతో జిల్లాల్లో ఇఫ్తార్ విందులు కూడా నిర్వహించుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ రోజు ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీకి వస్తున్న ఆదాయం, ఖర్చులు, పెండింగ్ బిల్లులు సహా పలు అంశాలపై జగన్ ఈ సందర్భంగా చర్చించారు.