ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి కేరళ సీఎం పినరయి విజయన్ హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. ముఖ్యమంత్రి సహా కేరళ ప్రభుత్వం ప్రతినిధులుగా ఎవరూ మోదీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం లేదని తెలిపింది. అయితే, ఇందుకు ఇతమిత్ధమైన కారణం ఏమిటనేది వెల్లడించలేదు.
రాష్ట్రపతి భవన్లో గురువారం సాయంత్రం 7 గంటలకు జరుగనున్న కార్యక్రమంలో రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఆయన కొత్త మంత్రివర్గ సభ్యులతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయిస్తారు.