జమ్ముకశ్మీర్, ఆగస్ట్ 26 : జమ్ములో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఈ ఉదయం తెల్లవారు జామున పోలీసులే లక్ష్యంగా విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక పోలీసు మృతి చెందగా, ఆరుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామాలోని పోలీసుల భవనంలోకి ముగ్గురు ఉగ్రవాదులు భవనంలోకి చొరబడి పోలీసుల పైకి గ్రనేడ్లు విసురుతూ కాల్పులు జరిపారు. జమ్ములోకి టెర్రరిస్టులు చొరబడ్డారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఒక్కసారిగా దాడి జరిగింది. ఈ దాడిలో గాయపడ్డ వారిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ముగ్గురు స్థానిక పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.