చెన్నై, ఆగస్ట్ 21 : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేరిపోయారు. రాజ్ భవన్ లో ఉప ముఖ్యమంత్రిగా పన్నీర్ కాసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతేకాకుండా పాండ్య రాజన్ ఈపీఎస్ కేబినేట్ లో భాషాభివృద్ది శాఖా బాధ్యతలను ఆప్పగిస్తూ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. అన్నాడీఎంకే మార్గదర్శక కమిటీకి కన్వీనర్ గా పన్నీర్, సహా కన్వీనర్ గా పళనిస్వామి కూడా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పళనిస్వామి, మంత్రి వర్గ సహచరులు పాల్గొన్నారు.