వరంగల్: గ్రేటర్ వరంగల్ మేయర్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గుండా ప్రకాష్ రావును ఎన్నికయ్యారు. శనివారం జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం లో కార్పొరేటర్లు గణేష్, అర్షిత రెడ్డి, బయ్యస్వామి ఆయన పేరును ప్రతిపాదించారు. ఎవరూ పోటీలో లేకపోవడంతో గుండా ప్రకాష్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రకటించారు.