చైనా కంపెనీ షావోమీ మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను తీసుకువచ్చింది. రెడ్మీ 7 పేరిట ఈ సరికొత్త ఫోన్ను విడుదల చేసింది షావోమీ. కొద్ది రోజుల క్రితమే రెడ్మీ నోట్ 7 ప్రో, రెడ్మీ నోట్ 7 స్మార్ట్ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో రిలీజైంది. సెల్ఫీ టైమర్, ఏఐ డ్యూయెల్ కెమెరా, ఏఐ పోర్ట్రైట్ మోడ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఫేస్ అన్లాక్, ఏఐ స్మార్ట్ బ్యూటీలాంటి ప్రత్యేకతలతో ఈ ఫోన్ లభిస్తుంది. ఏప్రిల్ 29న అమెజాన్, mi.com, ఎంఐ స్టోర్స్లో ఈ ఫోన్ అమ్మకాలు మొదలవుతాయి. రిలయన్స్ జియో నుంచి నాలుగేళ్ల పాటు డబుల్ డేటా, రూ.2,400 క్యాష్బ్యాక్ లభిస్తుందని షావోమీ ప్రకటించింది.
రెడ్మీ 7 ప్రత్యేకతలు:6.26 అంగుళాల హెచ్డీ డిస్ప్లే+(1520×720 పిక్సెల్స్), 19:9 యాస్పెక్ట్ రేషియో,
2 జీబీ, 3 జీబీ ర్యామ్,
32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్,
12+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా,
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా,
4,000 ఎంఏహెచ్ బ్యాటరీ,
ఎంఐయూఐ 10, ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్,
డ్రీమ్ బ్లూ, చార్మ్ నైట్ రెడ్, బ్రైట్ బ్లాక్ కలర్స్,
ధర:
2జీబీ+32జీబీ- రూ.7,999,
3జీబీ+32జీబీ- రూ.8,999.