న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చౌకిదార్ చోర్ హై అంటూ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. అయితే రాహుల్ కాంట్రవర్సీ కామెంట్స్ పై బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో రాహుల్ గాంధీ సూప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చౌకిదార్ చోర్ హై అని మాట దోర్లిందన్నారు. ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు చోట్ల మోదీ గురించి మాట్లాడుతూ.. చౌకీదార్ చోర్ అనే పదాన్ని రాహుల్ చాలా సార్లు వాడారు. కోర్టు వివరణకు ఆదేశించగా.. రాహుల్ సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చారు.