బీజేపీని ముస్లింలు నమ్మడం లేదని కర్ణాటక బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. అందుకే వారికి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ముస్లింలతో ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
నిన్న యడ్యూరప్ప చేసిన కామెంట్స్ ను మరువక ముందే ఈశ్వరప్ప వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షాలు.. అధికారంలో ఉందని బీజేపీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని పలువురు విమర్శిస్తున్నారు.