హైదరాబాద్, మార్చ్ 16: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్కి చెందిన లోక్సభ సభ్యులతో ఈరోజు సమావేశం కానున్నారు. తొలివిడత అభ్యర్థుల జాబితాలో భాగంగా ఆరుగురు అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుత ఎంపీలైన వినోద్కుమార్ (కరీంనగర్), కవిత (నిజామాబాద్), ప్రభాకర్రెడ్డి (మెదక్), బీబీ పాటిల్ (జహీరాబాద్), నగేశ్ (ఆదిలాబాద్), నర్సయ్యగౌడ్(భువనగిరి)లకు చోటు దక్కనుందని తెలిసింది. గతంలో ప్రకటించిన విధంగానే కేసీఆర్ ఎంపీలను విందుకు పిలిచి పార్టీ టికెట్లపై చర్చించనున్నారు. శనివారం ఉదయం ఎంపీలకు పిలుపు రానుంది.