న్యూఢిల్లీ, మార్చ్ 14: గురువారం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్వర్యంలో కీర్తిచక్ర, శౌర్యచక్ర, పరమ్ విశిష్ట్ సేవా పురస్కారాల ప్రదానం జరిగింది ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్కు పరమ్ విశిష్ట్ సేవా పురస్కారం వరించింది. ఆర్మీ జవాన్ వ్రహ్మపాల్ సింగ్, సిఆర్ పిఎఫ్ జవాన్లు రాజేంద్ర నైన్, రవీంద్ర బబ్బన్, మేజర్ తుషార్ గౌబలకు కీర్తి చక్ర పురస్కారాలు లభించాయి. ఆర్మీ, సిఆర్ పిఎఫ్ కు చెందిన 12 మంది అధికారులు, జవాన్లకు శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.