మార్చ్ 12: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి ఓ భారీ ఆఫర్ ను ప్రకటించింది. తన Xiaomi Mi A2,మరియు Redmi Note 6 Pro ఫోన్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఈ ఫోన్ల మీద దాదాపు రూ.2000 తగ్గింపును కంపెనీ ప్రకటించింది. ఈ తగ్గింపు ద్వారా వినియోగదారులు అసలు ధర మీద 5 శాతం తగ్గింపును అందుకోవడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
*Redmi Note 6 Pro ధర
3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్
లాంచ్ ధర రూ.11,499,
ప్రస్తుత ధర రూ.8,999.
4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్
లాంచ్ ధర రూ.13,499,
ప్రస్తుత ధర రూ.10,999.
*Xiaomi Mi A2 ధర
4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్
లాంచ్ ధర రూ.17,499,
ప్రస్తుత ధర రూ.11,999.
6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్
లాంచ్ ధర రూ.20,500,
ప్రస్తుత ధర రూ.15,999.