న్యూఢిల్లీ, మార్చ్ 06: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణాలు సముద్రగర్భాల్లోకి విస్తరిస్తున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం భారత జలాంతర్గామి ఒకటి తమ ప్రాదేశిక జల్లాలోకి వచ్చిందని పాకిస్తాన్ పేర్కొంది. తాము గట్టిగా హెచ్చరించడంతో అది తిరిగి వెళ్లిపోయినట్లు వెల్లడించింది . అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలకు భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. ఇలాంటి కట్టుకథలు చెప్పడం పాక్కు మొదటి నుంచి అలవాటేనని.. ముందు కూడా ఇలానే చాలాసార్లు దుష్ప్రచారాలు చేసిందని భారత నేవీ పేర్కొంది. పాక్ చేసే ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని భారత్ తెలిపింది. పాక్ నుండి ఎలాంటి పరిస్థితి వచ్చినా బదులు చెప్పడానికి భారత నావికాదళం సిద్ధంగా ఉందని.. భారత సముద్ర జలాల రక్షణకై తాము ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి సన్నద్ధంగా ఉన్నామని ఇండియన్ నేవీ పేర్కొంది.