హైదరాబాద్, జనవరి 30: ఈ మధ్యే టాలీవుడ్ లోకి అడుగుపెట్టి వరుసగా రెండు ఫ్లాప్ లను చవి చూసింది బెంగుళూరు బ్యూటి నిధి అగర్వాల్. అక్కినేని నాగ చైతన్యతో సవ్యసాచి , అక్కినేని అఖిల్ లో Mr మజ్ను సినిమాలతో తెలుగులోకి ప్రవేశించింది ఈ బ్యూటి. అయితే ఈ బ్యూటికి ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఎనర్జిటిక్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఈమెను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఓ ఫ్లాప్ హీరోయిన్ ని తీసుకోవడం వెనుక పూరి ప్లాన్ ఏమై ఉంటుందా..? అని ఆరా తీయగా.. రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే మిగిలిన వారికంటే నిధి అగర్వాల్ చాలా చీప్ గానే వస్తుందట.
So happy to be on board! 😊🙏🏼 @purijagan @Charmmeofficial @ramsayz looking forward to start shoot soon! 💥 pic.twitter.com/VTaubrUkp1
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) January 29, 2019
పూరి నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్న దగ్గర నుండి కాస్ట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే తక్కువ రేటుకి వచ్చే హీరోయిన్లనే ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈసారి నిధి అగర్వాల్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నప్పటికీ నిధి అగర్వాల్ తక్కువ రెమ్యునరేషన్ కి వస్తుండడంతో ఆమెనే ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా.. నిధి సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి!