మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' ఇటీవల సంక్రాంతి బరిలో నిలిచింది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు, ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేకపోయింది ఈ సినిమా. దాంతో అభిమానుల అంచనాలను అందుకోలేకపోయామని చెప్పేసి చరణ్ ఒక ప్రెస్ నోట్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశాడు. ఈ సినిమా వలన బయ్యర్లు 30 కోట్ల వరకూ నష్టపోయారట. వాళ్ల నష్టాన్ని కొంతవరకైనా తగ్గించవలసిన బాధ్యత తమపై ఉందనే అభిప్రాయాన్ని నిర్మాత దానయ్య దగ్గర చరణ్ చెప్పాడట. దాంతో ఇద్దరూ కలిసి ఓ 15 కోట్లను పరిహారంగా చెల్లిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారని వినికిడి. ఈ సినిమాకి గాను తాను తీసుకున్న పారితోషికంలో నుంచి 5 కోట్లను తిరిగి ఇచ్చేయడానికి చరణ్ సిద్దపడినట్లు సమాచారం. ఇక మిగతా 10 కోట్లను సమకూర్చే విషయంలో దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.