ముంభై, జనవరి 30: భరత్ అనే నేను తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న కియరా అద్వాని ఇప్పుడు తన తాజా హాట్ స్టిల్స్ తో కుర్రకారుని మతిపోగేట్టేస్తుంది. ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ ఫొటో షూట్ లో చాలా మంది హీరోయిన్స్ పాల్గొన్నప్పటికీ అందరికంటే కియారా సెక్సీ అందాలతో చితకొట్టేసిందనే కామెంట్స్ వస్తున్నాయి.
భరత్ అనే నేను సినిమాలో మహేష్ సరసన ట్రెడిషినల్ లుక్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇలా సడన్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించేసరికి కొందరు నమ్మలేకపొతున్నారు. ఇక తెలుగులో మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న కియారా రీసెంట్ గా వచ్చిన వినయ విధేయ రామ తో మాత్రం అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లోఅర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటిస్తున్న ఈ బ్యూటీ సౌత్ లో మరో రెండు బడా ప్రాజెక్టులను అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.