కనకదుర్గను గెంటేసిన అత్తింటివారు, సోదరుడు

SMTV Desk 2019-01-30 10:17:07  Kanaka Durga, Bindu

తిరువనంతపురం, జనవరి 30: కొన్నిరోజుల క్రితం శబరిమలలోని అయ్యప్ప దేవాలయానికి తన మిత్రురాలు బిందుతో కలిసి, పోలీసుల సాయంతో స్వామిని దర్శించుకున్న కనకదుర్గ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. ఆమెను భర్త, అత్తింటివారు ఇంట్లోనుండి గెంటేసారు. దీనిపై కనకదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కనకదుర్గ ప్రభుత్వ ఆశ్రయ గృహంలో ఉంటున్నారు. అత్తింటివారు ఆదరించని వేళ ఆమె పుట్టింటికి వెళ్ళాలని ప్రయత్నించింది కానీ ఆమె సోదరుడు ఇంట్లోకి రానివ్వలేదని తను స్వయంగా మీడియాకు వెల్లడించింది. తమవారంతా తనపై చాలా కోపంగా ఉన్నారని వాపోయింది.