న్యూఢిల్లీ, జనవరి 9: బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ తండ్రి నిర్మాత రాకేశ్ రోషన్కు గొంతు కేన్సర్ సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నిన్న హృతిక్ రోషన్ స్వయంగా వెల్లడించాడు. ఈ విషయం తెలిసిన బాలీవుడ్ దిగ్బ్రాంతికి లోనైంది. ఇప్పటికే కొంతమంది నటీనటులు కేన్సర్ బారినపడి పోరాడుతున్నారు.
కాగా ఈ విషయం తెలిసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేస్తూ మరేం భయపడాల్సిన అవసరం లేదని, రాకేశ్ రోషన్ ఫైటర్ అని పేర్కొన్నారు. కేన్సర్ నుంచి రాకేశ్ త్వరగానే కోలుకుంటారని, ఆందోళన చెందాల్సిన అసవరం లేదని హృతిక్ కి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ‘‘ప్రియమైన హృతిక్. రాకేశ్ రోషన్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయనో ఫైటర్. బోల్డంత ధైరం ఉంది. నాకు తెలుసు ఆయన కేన్సర్ను జయిస్తారు అని మోదీ ట్వీట్ చేశారు.
Dear Hrithik, praying for the good health of Shri Rakesh Roshan Ji. He is a fighter and I am sure he will face this challenge with utmost courage. @RakeshRoshan_N https://t.co/Z0IaYSS4A4
— Narendra Modi (@narendramodi) January 8, 2019