హనుమాన్‌ జోలికి వస్తే బీజేపీ లంకను కాల్చేస్తాడు..!

SMTV Desk 2018-12-25 13:03:55  Uttar Pardesh, Raj Babbar, Yogi Adityanath, Lord Hanuman

లక్నో, డిసెంబర్ 25: భగవంతుడైన హనుమంతుడిపై బీజేపీ నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజ్‌బ్బర్‌ అన్నారు. లేకపోతే ఆ హనుమంతుడే బీజేపీ పార్టీని లంకను కాల్చినట్లు కాల్చేస్తాడని హెచ్చరించారు. రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హనమంతుడు దళితుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో హనమంతుడి కులం చర్చనీయాంశమైంది.

తరవాత వొక బీజేపీ ఎమ్మెల్సీ ముస్లిం అంటే మరో యూపీ మంత్రి జాట్‌ అన్నారు. అదే బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ హనుమంతుడు బ్రాహ్మణుడంటే.. మరో ఎంపీ గిరిజనడన్నారు. ఇలా హనమంతుడి పేరును రాజకీయం చేయడంపై రాజ్‌బబ్బర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే హనుమంతుడిని ఇబ్బంది పెట్టినందుకు బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిందని, ఇలానే చేస్తే ఆ దేవుడు తన తోకతో బీజేపీ అనే లంకను కాల్చేస్తాడని హెచ్చరించారు.