హైదరాబాద్, జూలై 26: ఇటీవల హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తనపై చేసిన ఆరోపణలకు రేవంత్రెడ్డి మాట్లాడుతూ… “ నా నుంచి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నుంచి రక్త నమూనాలు తీసుకొని పరిశీలిస్తే తెలుస్తుంది ఎవరేమిటో, నా జీవితంలో ఇప్పటివరకు మందు ముట్టినట్లు ఋజువు చేస్తే ఎలాంటి శిక్ష వేసిన అనుభవిస్తాను” అని ఆయన అన్నారు. ఆయన మంగళవారం నారాయణపేటలో జరిగిన తెదేపా నియోజకవర్గ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఇలా స్పందించారు.