హైదరాబాద్, నవంబర్ 15: ఎన్నికల నామినేషన్ వెయ్యడానికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దాసోజుకు చేదు అనుభవం ఎదురయింది. పార్టీ ఖైరతాబాద్ సీటు ప్రకటించిన సంగతి తెలిసందే. దాసోజు శ్రవణ్ నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు రిటర్నింగ్ అధికారి నిరాకరించారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు వెళ్లిన శ్రవణ్ సహచరులు శ్రవణ్తో పాటు, ప్రతిపాదించిన వ్యక్తులు లేకపోవడంతో.. నామినేషన్ను స్వీకరించనని రిటర్నింగ్ అధికారి చెప్పారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి ఛాంబర్ నుంచి 100 మీటర్ల వరకు సెక్షన్ 144 అమలు చేశారు.