ఎన్నికల నామినేషన్ ప్రారంభం

SMTV Desk 2018-11-12 13:10:32  Telangana Elections, Election Nominations, Election Comission

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణాలో రానున్న ఎన్నికల సందర్భంగా నేటి నుండి నామినేసన్లు స్వీకరించారున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో డిసెంబర్ 7 న నిర్వహించే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సిద్దమయింది. ఇందుకోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఓ రిటర్నింగ్ అధికారిని ఏర్పాటు చేశారు.

అక్టోబర్‌లో రాష్ట్రమంతటా మూడు రోజులు పర్యటించిన అధికారులు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశమై ఎన్నికల నిర్వహణను సమీక్షించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే‌ జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. కాగా ఎన్నికల అధికారి రజత్‌కుమార్ ఓటర్ల జాబితాలో తప్పులు, సవరణలను వేగిరం చేశారు. ఈసారి వికలాంగులు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.