వొడిశా, నవంబర్ 10: కియోంజర్ జిల్లా బడౌగావ్ గ్రామంలో రెండు రోజుల కిందట ఘోర సంఘటన చోటుచేసుకుంది. చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న రాజేంద్ర నాయక్ అనే పాతికేళ్ల యువకుడు గ్రామానికి చెందిన కమలాపాత్ర అనే వివాహితతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడు.
పండగ అని, తద్దినమని ఎప్పుడు ఊరికి వచ్చినా ఆమె ఇంట్లోకి వెళ్లేవాడు. బుధవారం రాత్రి కూడా వెళ్లాడు. ఏదో విషయంలో అతడు ఆమెను తిట్టాడు. గొడవ ముదిరింది. తర్వాత మంచంలో పడుకుని నిద్రపోయాడు. తనను తిట్టడాన్ని జీర్ణించుకోలేని కమల.. కత్తి తీసుకుని అతని మర్మాంగాలు కోసేసింది. అరుపులు విన్న స్థానికులు నాయక్ ను కటక్ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కమలను విచారించగా నేరం చేసినట్లు వొప్పుకుంది.