ముంబై, అక్టోబర్ 31: భారత కుబేరుడు అనగానే ప్రథమంగా వినిపించే పేరు ముఖేష్ అంబాని. అయితే ఈ కుబేరుడి కుమార్తె వివాహ సమయం తగ్గర పడింది. డిసెంబర్ 12నముకేశ్ కూతురు ఈశా పెళ్లి అంగరంగవైభవంగా జరగనుంది. కానీ.. వాళ్ల ఇంట్లోనే పెళ్లి వేడుక ఉంటుందట. ముంబైలో ఉన్న ముకేశ్ ఇంట్లోనే పెళ్లి వేడుక ఉంటుందట. కాకపోతే పెళ్లి మాత్రం వైభవంగా జరుగుతుంది. ఆనంద్ పిరమాల్ తో ఈశా పెళ్లి జరుగుతన్న సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతి, సంప్రదాయలతో పెళ్లి జరుగుతుంది. కాకపోతే.. వివాహ విందును మాత్రం ఉదయ్ పూర్ లో పెళ్లి తర్వాత ఏర్పాటు చేస్తున్నారట.