ఢిల్లీ, జూలై 1 : ఉత్తరాఖండ్ లోని పౌరీగల్వార్లో ఈ రోజు జరిగిన ఉదయం బస్సు లోయలో పడిన ఘోర ప్రమాదంలో 40 మందికిపైగా మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఘటనాస్థలిని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సందర్శించారు. ప్రమాదంలో చనిపోయిన వాళ్లలో ఇప్పటికి ముప్ఫై మృతదేహాలను వెలికి తీశారని ఆయన తెలిపారు. ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారాన్ని ప్రకటించారు.