పారిగర్వాల్, జూలై 1: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 35 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. ఆదివారం పారిగల్వార్ జిల్లా నానిదండ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలం నుంచి 20 మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీసినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.