హైదరాబాద్, మే 7 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన "నా పేరు సూర్య" చిత్రం మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా నటించిన చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రాన్ని సైనికులతో కలిసి అల్లు అర్జున్ వీక్షించారు. ఈ నేపథ్యంలో సూర్య పాత్ర చేసిన అల్లు అర్జున్ని భారత సైనిక కుటుంబాలు రోజ్ ఫ్లవర్తో అభినందించాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో రియల్ సన్నివేశాలు నటులతో చాలా బాగా చిత్రీకరించారని, మా డిసిప్లైన్ కళ్లకు కట్టినట్టుగా చూపించిన దర్శకుడికి కృతజ్ఞతలు అంటూ తెలిపారు. ఈ సందర్భంగా మేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ... "ఈ ప్రిమియర్ షోను ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్కు చాలా చాలా థాంక్స్. ఎందుకంటే సోల్జర్స్కి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. కామన్ మ్యాన్కి తెలియని చాలా విషయాల్ని ఇందులో చూపించారు. భారతదేశం నాది అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలి. బోర్డర్ లో ఓ సైనికుడు ఎంత ఇష్టపడి 125 కోట్ల మంది ప్రజల్ని కాపాడుతాడో సామాన్య ప్రజలకి తెలియాలి.. ఆర్మీ అంటే దేశ గౌరవం అని.. ఈ విషయాన్ని అందిరికి తెలిసేలా.. పాత్రలో జీవించిన అల్లు అర్జున్ని మా ఆర్మీకి వెల్కం చెబుతున్నాం.. గతంలో మమ్ముట్టి, సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని లాంటి వారు కూడా దేశ సేవలో భాగస్వాములయ్యారు.. ఇలాంటి చిత్రంలో నటించిన అల్లు అర్జున్కి హాట్సాఫ్" అని తెలిపారు.