అంబానీ ఇంట పెళ్లి సందడి..

SMTV Desk 2018-05-07 11:51:19  MUKESH AMBANI. ISHA AMBANI, PIRAMIL GROUPS, ANANDH PIRAMIL.

హైదరాబాద్, మే 7 : రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ.. ఇటీవలే తన తనయుడు ఆకాష్ అంబానీకి నిశ్చితార్థం జరిపించారు. తాజాగా ఆ ఇంట మరో పెళ్లి బాజా మోగనుంది. ఆయన కుమార్తె ఈషా అంబానీ.. పిరమల్‌ గ్రూప్‌ వారసుడైనా ఆనంద్‌ పిరమల్‌ను ప్రేమ పెళ్లి చేసుకోబోతోంది. అంబానీ, పిరమల్‌ కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా మంచి స్నేహం ఉంది. ఇటీవలే మహాబలేశ్వర్‌లో ఒక గుడి దగ్గర ఆనంద్‌ పిరమల్‌ ఈషాకు ప్రపోజ్‌ చేశారు. ఈషా వెంటనే ఒప్పుకోవడం.. ఇరువైపులా పెద్దలకు వారు ప్రేమను తెలియజేయడం.. వాళ్లూ అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. "పిరమల్‌ స్వాస్థ్య" పేరుతో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సంస్థను స్థాపించి, రోజుకు 40 వేల మంది రోగులకు చికిత్సనందిస్తున్నారు. ఇక ఈషా.. రిలయన్స్‌ రిటైల్‌ బోర్డుల్లో సభ్యురాలిగా ఉంది. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీయే చేస్తున్న ఆమె చదువు ఈ జూన్ కల్లా పూర్తి కానుంది.