రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 25: ప్రజల జీవితాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు అన్నారు. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో ఎస్సీ, బీసీలను అణగదొక్కేస్తున్నా అడిగే నాథుడే లేడని విమర్శించారు. జిల్లాలోని నెరేళ్ల బాధితులను కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు పరామర్శించారు. ఎస్సీ, బీసీలకు జరుగుతున్న అన్యాయం కనబడటం లేదా? అంటూ వీహెచ్ ప్రశ్నించారు. గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో ఉన్నవారిని తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, నయీమ్ వల్ల అన్యాయం జరిగిన వారికి మాత్రం న్యాయం చేయడం లేదని హనుమంతరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.