ఖమ్మం, మార్చి 30: రఘునాథ్పాలెం పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ లారీ ఢీకోని మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే సమీపంలోని ఓ గ్రామానికి ఎస్సైతోపాటు ఆయన బందోబస్తుకు వెళ్లారు. తిరిగొచ్చాక జీపు దిగిన ఆయన.. తన వాహనం కోసం రోడ్డు దాటేందుకు యత్నించారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఓ లారీ ఆయనపై ఎక్కేసింది. ఆయన పొట్ట కింద భాగం నుంచి వాహనం ఎక్కేయటంతో రక్తపు మడుగులో ఆయన పడి కొట్టుమిట్టారు. విషయం తెలుసుకొన్న కానిస్టేబుళ్లు ఆంబులెన్స్ కోసం ఎదురుచూస్తే ఆలస్యమవుతుందని.. పోలీస్ వాహనంలోనే ఆయన్ని ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.