హైదరాబాద్, జనవరి 5 : తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను గురించి వివరించారు. ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా మియాపూర్- ఎల్బీనగర్ మెట్రోరైల్ సేవలు జూన్ 2న అందుబాటులోకి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. రూ.2 వేల కోట్లతో నగరంలో రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. రూ.700 కోట్లతో ఓఆర్ఆర్ పరిధిలోని 174 గ్రామాలకు నీళ్లిస్తామన్నారు. అలాగే, రూ.3100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. కాగా, ఎల్బీ నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో 4 వేల ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఈ మేరకు మున్ముందు జరుగబోయే అభివృద్ధి పనులను గురించి ఆయన వెల్లడించారు.