ముంబయి, డిసెంబర్ 21 : ఆర్.బాల్కీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్యాడ్మ్యాన్’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్కు భారీ ఎత్తులో స్పందన లభించింది. బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆయన తప్ప మరొకరు నటించలేరు అనేట్టుగా, భార్య ట్వింకిల్ ఖన్నా అక్షయ్కుమార్ ను దీ బెస్ట్ అన్నారు. కాగా, ఆయన సరసన రాధికా ఆప్టే, సోనమ్కపూర్ కథానాయికలుగా చేశారు. అయితే, ఈ సినిమాను ముఖ్యంగా పాఠశాలల్లో చదివే ఆడపిల్లలు, ప్రధానోపాధ్యాయులు వీక్షించే ఏర్పాట్లపై ఇప్పటికే చాలా మంది మంత్రులతో మాట్లాడినట్లు చిత్ర నిర్మాత, ట్వింకిల్ ఖన్నా చెప్పుకొచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని 2018 జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.