న్యూఢిల్లీ, డిసెంబర్ 4: గత కొద్ది కాలంగా ఈ-కామర్స్ రంగంలో పేటీయ౦ దూసుకెళ్తు౦ది. ఈ సందర్బంగా పేటీయ౦ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ వర్మ మాట్లాడుతూ... ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి పోటి సంస్థలను అధిగమించేదుకు రానున్న కాలంలో 250 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకు నిధుల సమీకరణ ప్రక్రియను ప్రారంభిస్తామని అన్నారు. మార్కెట్లో పోటి సంస్థలకు ధీటుగా అగ్రస్థాయిలో నిలిచే౦దుకే ఈ భారీ పెట్టుబడుల ప్రయత్నమని పేర్కొన్నారు. ఇప్పటికే పేటీయ౦లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నానరనడంలో అతిశయోక్తి లేదు.