బెంగళూరు, అక్టోబర్ 14 : ప్రముఖ సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్యకు సంబంధించి అనుమానితుల నమూనా చిత్రాలను సిట్ బృందం విడుదల చేసింది. సాక్ష్యాల కోసం.. హత్య జరిగిన రోజు నుండి గౌరీ ఇంటి ముందు రెక్కి నిర్వహించిగా, అనుమానితులకు సంబంధించి వీడియో ఆధారాలు లభించినట్లు సిట్ పోలీస్ చీఫ్ బీకే.సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష సాక్ష్యులు అందించిన సమాచారం ప్రకారం ఒక మూడు స్కెచ్ లను గీయించి వాటిని మీడియా ముందుకు తీసుకువచ్చారు. కాగా ఈ కేసులో ఇప్పటికి 250 మందిని విచారించినట్లు సింగ్ వెల్లడించారు. అయితే ఈ హత్యలో నిందితుల వివరాలను తెలియజేసిన వారికి రూ. 10 లక్షల బహుమతిని కూడా అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.