మతిస్థితిమం లేని మహిళపై అత్యాచారం!

SMTV Desk 2019-11-14 12:15:52  

కోల్‌కతాలో దారుణ ఘటన జరిగింది. మతిస్థితిమం కోల్పోయిన మహిళను కొందరు వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి పంచశ్యార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళ(38) ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. అక్కడి వచ్చిన కొందరు వ్యక్తులు ఆమెను కారులోకి లాగి ఎత్తుకెళ్లిపోయారు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున సోనార్‌పూర్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. ఆమెను చూసిన స్థానికులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించి బల్లిగంజ్ వెళ్లడానికి రైలు టిక్కెట్ కొని పంపించారు. అక్కడ రైలు దిగిన బాధితురాలు గారియాహాట్‌లోని బంధువుల ఇంటికి చేరుకుని తనపై జరిగిన అత్యాచారం గురించి తెలిపింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నామని, అయితే తనపై ఎంతమంది అత్యాచారం చేశారన్నది బాధితురాలు స్పష్టంగా చెప్పలేకపోతోందని ఓ పోలీసు అధికారు తెలిపారు.