ట్రిఫుల్ సెంచరీకి కారణం గంగూలీనట!

SMTV Desk 2019-10-28 15:17:42  

వరల్డ్ క్రికెట్‌లో విధ్వంసక ఓపెనర్ గా పేరుగాంచిన వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌లోనే తనదైన ముద్ర వేశాడు. ెహ్వాగ్‌లోని ఆ దూకుడుని తొలుత పసిగట్టింది మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీనట. ఈ విషయాన్ని స్వయంగా సెహ్వాగ్ వెల్లడించాడు. కెరీర్ ఆరంభంలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన సెహ్వాగ్‌ని తన కెప్టెన్సీలో ఓపెనర్‌గా ఆడించిన సౌరవ్ గంగూలీ.. క్రికెట్ ప్రపంచానికి విధ్వంసక ఓపెనర్‌ని పరిచయం చేశాడు.‘మిడిలార్డర్ నుంచి మీరు ఓపెనర్‌గా ఎలా మారారు..? అని నన్ను తరచూ అందరూ అడుగుతుంటారు. అలా నేను ఓపెనర్‌గా మారడంలో సౌరవ్ గంగూలీది కీలకపాత్ర. ఫస్ట్ దాదా నన్ను ఓపెనింగ్ చేయమన్నప్పుడు.. నువ్వెందుకు ఓపెనర్ ఆడకూడదు..? సచిన్‌ని ఓపెనర్‌గా పంపిచొచ్చు కదా..? అని అడిగా. కానీ.. దాదా మాత్రం సింపుల్‌గా ఓపెనర్ స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. నీకు మూడు నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్‌గా అవకాశమిస్తా.. ఒకవేళ నువ్వు ఫెయిలైతే..? నిన్ను జట్టు నుంచి తప్పించే ముందు మళ్లీ మిడిలార్డర్‌లో ఓ అవకాశమిస్తా అని భరోసా ఇచ్చాడు’ అని సెహ్వాగ్ వెల్లడించాడు.భారత్ జట్టులోకి 1999, ఏప్రిల్‌లో అరంగేట్రం చేసిన సెహ్వాగ్.. ఫస్ట్ మ్యాచ్‌ అజయ్ జడేజా కెప్టెన్సీలో ఆడాడు. కానీ.. ఆ తర్వాత జట్టు పగ్గాలు అందుకున్న సౌరవ్ గంగూలీ.. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో సమూలంగా మార్పులు చేశాడు. ఈ క్రమంలోనే ఓపెనర్‌ అవతారమెత్తిన సెహ్వాగ్ సుదీర్ఘకాలం భారత్ జట్టుకి ఆడి వన్డేల్లో 7,518 పరుగులు, టెస్టుల్లో 8,586 రన్స్ చేశాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో ట్రిఫుల్ సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా నిలిచిన సెహ్వాగ్.. వన్డేల్లోనూ డబుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.