తెలంగాణ సచివాలయాన్ని బీఆర్కె భవన్కు మార్చడంతో ఉద్యోగుల అభ్యర్ధన మేరకు వారి సౌకర్యార్ధం మెట్రో షటిల్ పేరిట ప్రత్యేక బస్ సర్వీసులు ప్రారంభించింది. ఈ బస్సులు బీఆర్కె భవన్-లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ మద్య ఉదయం, సాయంత్రం మాత్రమే తిరుగుతాయి. ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతీ 15 నిమిషాలకు ఒకటి చొప్పున తిరుగుతాయి. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి జెండా ఊపి ప్రారంభించారు. నగరంలో వివిద ప్రాంతాల నుంచి వచ్చే సచివాలయం ఉద్యోగుల సౌకర్యార్ధం దీనిని ప్రారంభించామని కనుక ఉద్యోగులు అందరూ మెట్రో షటిల్ బస్ సర్వీసులను ఉపయోగించుకోవాలని కోరారు.