కేంద్ర ప్రభుత్వ కొత్త భీమా...పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి రూ.2 లక్షలు

SMTV Desk 2019-10-19 14:44:02  

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)ను అందించేందుకు సిద్దమయ్యింది. అయితే ఇది ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీని కాలపరిమితి ఏడాది. తర్వాత మళ్లీ పాలసీని రెన్యూవల్ చేయించుకోవాలి. పాలసీ కవరేజ్ రూ.2 లక్షలు. సంవత్సరానికి రూ.330 చెల్లిస్తే సరిపోతుంది.జీవన్ జ్యోతి బీమా స్కీమ్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ తీసుకున్న వారు మరణించినప్పుడు పాలసీ మొత్తం నామినీకి వస్తుంది. అంతేతప్ప మరేఇతర ప్రయోజనాలు లభించవు. బ్యాంకుల్లో ఈ పాలసీ తీసుకోవచ్చు. దీని కోసం బ్యాంకులు ఎల్ఐసీ సహా ఇతర ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ పాలసీని అందిస్తున్నాయి.18 నుంచి 50 మధ్యలో వయసు ఉన్న వారు పాలసీ తీసుకోవచ్చు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం మొత్తం ఆటోమేటిక్‌గానే మీ అకౌంట్ నుంచి కట్ అవుతాయి. పాలసీ గడువు జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుంది. తర్వాత పాలసీని రెన్యూవల్ చేసుకోవాలి.ఒక వ్యక్తి ఒక అకౌంట్ ద్వారా ఒక్కసారి మాత్రమే పాలసీ తీసుకోగలడు. పాలసీదారుడు మరణిస్తే నామిని వారి డెత్ సర్టిఫికెట్‌ను తీసుకొని బ్యాంకుకు వెళ్లి బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పుడు నామినీ అకౌంట్‌లోకి బీమా డబ్బులు వస్తాయి.