న్యూ ఢిల్లీ: సీనియర్ లాయర్ రాంజెఠ్మలానీ 95 ఏళ్ల వయస్సులో ఈ రోజు ఉదయం కన్ను మూశారు.ఆయన ఢిల్లీ లో ఉన్న తన నివాసస్థలం లో తుది శ్వాస విడిచారు.రాం జెఠ్మలానీ గత రెండు వారాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు.ఆయన మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయ్ ప్రభుత్వం లో కేంద్ర న్యాయ శాఖ మరియు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ లో సేవలు అందించారు.