రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఒక్కరోజులోనే మాట మార్చారు. తన కుమారుడు ఓడిపోవడానికి డిప్యూటీ సీఎం సచిన్ పైలటే కారణమని వ్యాఖ్యానించిన ఆయన.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందంటూ చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చిన గెహ్లాట్.. మీడియా అర్థం పర్థం లేని అపోహలు సృష్టిస్తుందన్నారు. సచిన్ వల్లే జైపూర్ నుంచి పోటీ చేసిన తన కొడుకు వైభవ్ గెహ్లాట్ ఓడిపోయారని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారాయన. దీంతో సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య విబేధాలు వచ్చాయంటూ మీడియాలో వార్తలు హల్చల్ చేయడంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు గెహ్లాట్.